వాషింగ్టన్: క్వాడ్ దేశాల గ్రూపులో ఇండియా ఓ చోదకశక్తిగా పనిచేస్తుందని అమెరికా పేర్కొన్నది. ప్రాంతీయ దేశాల అభివృద్ధి ఇండియా కీలకంగా మారనున్నట్లు వైట్హౌజ్ వెల్లడించింది. ఇటీవల మెల్బోర్న్లో క్వాడ్ దేశాల విదేశాంగ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైట్హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం, ఉక్రెయిన్పై రష్యా దూకుడు అంశాలను కూడా క్వాడ్ సమావేశాల్లో చర్చించారు. భారత్ను లైక్ మైండెడ్ భాగస్వామిగా భావిస్తామని, దక్షిణాసియా-హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆ దేశాన్ని లీడర్గా చూస్తామని, క్వాడ్లో ఆ దేశం డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుందని, ప్రాంతీయ అభివృద్ధిలోనూ ఇండియా పాత్ర కీలకం అవుతుందని వైట్హౌజ్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పెర్రీ తెలిపారు. క్వాడ్ దేశాల గ్రూపులో ఇండియాతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి.