దుబాయ్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో అరంగేట్రం చేస్తున్న ఉగాండ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో కలిసి గ్రూప్-బీలో భారత్ బరిలోకి దిగనుంది. వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ మెగాటోర్నీలో 16 జట్లు 48 మ్యాచ్లు ఆడనున్నాయి. పది వేదికల్లో ఈ టోర్నీ మ్యాచ్లు జరుగనుండగా సెమీస్, ఫైనల్స్ మాత్రం సర్ వీవియన్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్ (అంటిగ్వా)లో జరుగుతాయి.
గ్రూప్ ఏ: బంగ్లాదేశ్, ఇంగ్లండ్, కెనడా, యూఏఈ
గ్రూప్ బీ: భారత్, ఉగాండ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్
గ్రూప్ సీ: పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, జింబాబ్వే, పపువా న్యూ గినియా
గ్రూప్ డీ: వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్
(న్యూజిలాండ్ వైదొలగడంతో ప్రవేశం)