పొచెఫ్స్ట్రోమ్: జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో ఇప్పటికే క్వార్టర్స్కు దూసుకెళ్లిన భారత జట్టు లీగ్ దశలో మూడో మ్యాచ్లోనూ నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గ్రూప్-‘డి’లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో వేల్స్, జర్మనీని చిత్తు చేసిన మన అమ్మాయిలు మంగళవారం జరిగిన ఆఖరి పోరులో 4-0తో మలేషియాను మట్టికరిపించారు. ముంతాజ్ ఖాన్ (10, 26, 59వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించగా.. సంగీత కుమారి (11 ని) ఒక గోల్ చేసింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.