కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే తాత్కాలికంగా ఆ దేశం విడిచి రావాలని దౌత్యకార్యాలయం ఆ ప్రకటనలో కోరింది. అత్యవసరం కానీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అక్కడి భారతీయులను ఎంబసీ కోరింది. అవసరం అయితే తప్ప ఆ దేశానికి వెళ్లవద్దు అని కూడా ఎంబసీ కార్యాలయం పేర్కొన్నది. కీవ్లో ఉన్న ఎంబసీతో భారతీయులు టచ్లో ఉండాలని, ఏదైనా విపత్తు జరిగితే తక్షణమే అక్కడికి సహాయం పంపేందుకు సమాచారం ఇవ్వాలని ఎంబసీ వెల్లడించింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు సహాయసహకారాలు అందించేందుకు ఎంబసీ నిత్యం పనిచేస్తుందని అన్నారు.