సఫారీలతో మూడు వన్డేల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు.. రెండో వన్డేకు రెడీ అయింది. ఓటమితో వన్డే సిరీస్ను ప్రారంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలని చూస్తోంది. తొలి వన్డే ఓడిన పార్ల్ మైదానంలోనే ఈ మ్యాచ్ కూడా జరుగుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత సారధి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో ధావన్, కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మెచ్చుకున్నాడు. మరొక్క మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే మ్యాచ్ తమ సొంతమయ్యేదన్నాడు. ఈ మ్యాచ్లో కూడా తొలి వన్డే ఆడిన జట్టుతోనే దిగుతున్నామని, ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు. సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక్క మార్పు జరిగింది. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాల జట్టులో చేరాడు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా: క్వింటన్ డీకాక్, జానెమన్ మలన్, టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రాసీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండీ ఫెహ్లువాయో, కేశవ్ మహరాజ్, సిసాండ మలాంగ, లుంగి ఎన్గిడీ, తబ్రయిజ్ షంసీ.