కివీస్ తాత్కాలిక కెప్టెన్ శాంట్నర్ మళ్లీ భారత్ను దెబ్బకొట్టాడు. పవర్ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన భారత జట్టుకు ఆ తర్వాతి ఓవర్లోనే శాంట్నర్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ (29), సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చాడు.
దీంతో రోహిత్ శర్మ (46 నాటౌట్)కు రిషభ్ పంత్ (4) జతకలిశాడు. అతను కూడా తొమ్మిదో ఓవర్ చివరి బంతికి శాంట్నర్ వలలో చిక్కాడు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. నీషమ్కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.