న్యూఢిల్లీ, నవంబర్ 28 : దేశంలో ఊబకాయుల సంఖ్య పెరుగుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. 33 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐదేండ్ల లోపు చిన్నారుల్లో వయసుకు మించి బరువు ఉన్న వారి సంఖ్య 2015-16 నాటి 4వ విడుత సర్వేకు, 2019-21 మధ్య నిర్వహించిన 5వ విడుత సర్వేకు పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జమ్ముకశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్, మిజోరం, యూపీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, లఢక్లలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్య పెరిగింది.
భార్యలను భర్తలు కొట్టడం సబబే!
భార్యలను భర్తలు కొట్టడాన్ని 14 రాష్ర్టాల్లోని 30 శాతానికి పైగా మహిళలు సమర్థించారని ఎన్హెచ్ఎఫ్ఎస్-5 సర్వే పేర్కొన్నది. సర్వేలో భాగంగా ‘మీ అభిప్రాయంలో భార్యలను భర్తలు కొట్టడం సమర్థనీయమేనా?’ అనే ప్రశ్నించారు. దీనికి తెలంగాణలో 84 శాతం, ఏపీలో 84, కర్ణాటకలో 77 శాతం మంది సమర్థనీయమే అని బదులివ్వడం విశేషం.