 
                                                            
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతోంది. సోమవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 29,705 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 15,816 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికిగాను, ప్రస్తుతం 1633 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా చేరుతోంది. సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 9,310 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 8,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాట క ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నా రు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 410 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
                            