న్యూఢిల్లీ: మెగాటోర్నీల కోసం స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సన్నద్ధమవుతున్నాడు. ఆంటిల్యాలో కొన్ని నెలలుగా క్లాజ్ బార్టోనీట్జ్ ఆధ్వర్యంలో నీరజ్ మెళకువలు నేర్చుకుంటున్నాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు మరికొన్నాళ్లు శిక్షణ పొందనున్నాడు. ఈ మేరకు అతడికి మరింత ఆర్థిక సహాయం అందించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) ఆమోదం తెలిపింది. 14 రోజుల పాటు అమెరికాలో శిక్షణ కోసం నీరజ్కు టాప్స్ రూ.5.5 లక్షలు చెల్లించడానికి అంగీకరించింది.