బెంగుళూరు: ఆగస్టు 31వ తేదీన గణేశ్ చతుర్థి జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున బెంగుళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ రోజున జంతు బలి, మాంస విక్రయం జరగకూడదని బ్రుహత్ బెంగుళూరు మహానగర పాలిక ఆదేశాలు జారీ చేసింది. బీబీఎంపీ పరిమితుల్లో ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.