Lok Sabha Elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తొలి రెండు దశల్లో 2,823 మంది అభ్యర్థులు పోటీ పడగా, ఇందులో మహిళా అభ్యర్థులు 235 మంది(8 శాతం) మాత్రమే. మొదటి దశలో 135 మంది మహిళలు పోటీపడగా, తమిళనాడు నుంచి అత్యధికంగా 76 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇక రెండో దశలో పోటీకి నిలబడ్డ మహిళా అభ్యర్థులు 100 మంది కాగా, అత్యధికంగా కేరళ నుంచి 24 మంది ఉన్నారు.
మరింత మంది మహిళా అభ్యర్థులకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వాల్సిందని ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సుశీలా రామస్వామి అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చే వరకు పార్టీలు ఎందుకు వేచి చూస్తున్నాయి? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.