నెహ్రూ జాతీయ సీనియర్ హాకీ టోర్నీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గూంచా ఏస్టేట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ ఆయిల్, ఇండియన్ రైల్వేస్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన తొలి సెమీస్లో ఇండియన్ ఆయిల్, ఇండియన్ నేవీ హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఇండియన్ ఆయిల్ జట్టు 4-2తో గెలిచింది. మరో సెమీస్లో ఇండియన్ రైల్వేస్ 4-0 తేడాతో పంజాబ్ నేషనల్ బ్యాంక్పై అలవోకగా గెలిచింది. రైల్వేస్ తరఫున పర్దీప్సింగ్(15ని, 51ని), అజ్మీర్సింగ్(28ని), అజయ్ యాదవ్(53ని) గోల్స్ చేశారు.