Viral Video : ఇంట్లో పార్టీ జరిగినప్పుడో, బంధువులు, ఫ్రెండ్స్తో డిన్నర్ చేసినప్పుడో రాత్రి మిగిలిపోయిన ఫుడ్ను మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్గా తీసుకుంటారు. ఈ సబ్జెక్ట్పై ఓ ఇన్స్టాగ్రాం రీల్ లేటెస్ట్గా నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ నల్లా నుంచి వచ్చే నీటిలో వండిన నాన్ను కడగడం కనిపిస్తుంది. అంతకుముందు రాత్రి ఫ్యామిలీ డిన్నర్లో మిగిలిన నాన్ అదని వీడియోపైన టెక్ట్స్లో రాసుకొచ్చారు.
నీటిలో కడిగిన అనంతరం నాన్ను పెనంపై వేసి రెండు వైపులా మళ్లీ హీట్ చేయడం ఈ క్లిప్లో చూడొచ్చు. గ్లాస్ కంటైనర్లో మిగిలిన చికెన్ను ఆమె సర్వ్ చేసుకోవడం కనిపిస్తుంది. ఇది తన తల్లి చేసిన తన ఫేవరెట్ డిష్ల్లో ఒకటైన చికెన్ బిహారి బోటీ అని మహిళ తెలిపింది. ఆపై ఆమె హాట్ నాన్తో కలిపి ఫుడ్ను ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.2 కోట్ల వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్టయ్యారు.
అయితే నాన్ను ఎందుకు నీటితో కడగాల్సి వచ్చిందని కామెంట్స్ సెక్షన్లో పలువురు యూజర్లు తలలుపట్టుకున్నారు. ఆమె అలా చేయడాన్ని పలువురు విమర్శించారు. అయితే ఎడిట్ చేసిన క్యాప్షన్లో ఇన్స్టాగ్రాం యూజర్ వివరణ ఇచ్చారు. తాను నాన్ను ఎందుకు నీటిలో కడిగానో వివరిస్తూ బ్రెడ్, టోస్ట్, లేదా నాన్పై వాటర్ జోడిస్తే అది మెత్తగా మళ్లీ కొత్తదానిలా తాజాదనంతో ఉంటుందని, తాను ఫిల్టర్ వాటర్ యూజ్ చేశానని, ఈ వాటర్నే యూజ్ చేయాలని, నల్లా నీళ్లు కాదని చెప్పుకొచ్చారు.
Read More :
Food Habits | తిండి తిప్పలు.. మితం తప్పితే అమృతమైనా విషమే