భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళను నలుగురు యువతులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండోర్లోని ఎల్ఐజీ ఇంటర్సెక్షన్ సమీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట నవంబర్ 4 రాత్రి ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
इंदौर की गुण्डिया इनका पूरा गैंग एक लड़की को की धुनाई करने में जुटा हुआ है pic.twitter.com/iDWep3A4y1
— Tushar Srivastava (@TusharSrilive) November 7, 2022
ఈ వీడియోలో ఓ మహిళపై యువతులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. బాధితురాలిని తోసివేస్తూ బెల్ట్తో కొడుతుండటం కనిపించింది. యువతులు రోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ మహిళను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఎంఐజీ పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ అజయ్ వర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. నలుగురు యువతులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అన్నారు. తుషార్ శ్రీవాస్తవ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.