న్యూఢిల్లీ : దసరా నవరాత్రులు ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా పండగ సన్నాహాలు ఊపందుకున్నాయి. సంగీతం, డ్యాన్స్ ముఖ్యంగా గర్బా, దాండియా లేకుండా నవరాత్రి ఉత్సవాలను ఊహించలేం. పర్వదిన ఏర్పాట్లలో భాగంగా ఇటీవల మహిళలు నీటిలో గర్బా ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో స్విమ్మింగ్ పూల్లో పలువురు డ్యాన్స్ చేస్తున్న వీడియోను వార్తాసంస్ధ ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. లవ్యాత్రి మూవీ లోని చొగద తారా సాంగ్కు వీరు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్ను ఇప్పటివరకూ 17,000 మందికి పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి.
#WATCH राजस्थान: उदयपुर में गरबा का आयोजन स्विमिंग पूल में किया गया। (23.09) pic.twitter.com/AIzqWi8rAL
— ANI_HindiNews (@AHindinews) September 23, 2022
వీరు వినూత్నంగా గర్భా పెర్ఫామెన్స్ ఇచ్చారని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. తొమ్మిది రూపాల్లో భక్తులను అలరించే దుర్గామాత నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమై అక్టోబర్ 5న విజయదశమితో ముగుస్తాయి. పెర్ఫామెన్స్ ఇచ్చారని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. తొమ్మిది రూపాల్లో భక్తులను అలరించే దుర్గామాత నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమై అక్టోబర్ 5న విజయదశమితో ముగుస్తాయి.