భోపాల్ : దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మధ్యప్రదేశ్లోని షియోపూర్లో వెలుగుచూసింది. నిందితుడిని బాధితురాలి బంధువులు ఘటనా స్ధలంలో పట్టుకున్నారు. బాధితురాలిని గ్రామానికి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితుడు ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక నిందితుడితో కనిపించింది. నిందితుడిని చితకబాదిన కుటుంబ సభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.