న్యూఢిల్లీ: ఢిల్లీలోని పంజాబీ భాగ్లో ఉన్న ఓ ఇంటి నుంచి పనిమనిషి సుమారు 10 కోట్ల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఆ కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్కు చెందిన మోహన్ కుమార్గా గుర్తించారు. కుమార్తో పాటు అతనికి సహకరించిన బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూలై 4వ తేదీన ఓ ఇంటికి చెందిన కుటుంబం అమెరికాలో ఓ ఫంక్షన్ హాజరయ్యేందుకు వెళ్లింది. అయితే ఇంట్లో అయిదేళ్లుగా పనిచేస్తున్న వ్యక్తికి ఇంటి తాళాలను అప్పగించారు. ఇక అదే ఇంట్లో పనిచేస్తున్న మరో పనిమనిషి జూలై 18వ తేదీన ఓనర్కు ఫిర్యాదు చేశాడు. కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పాడు. కారు, నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్లు ఓనర్కు తెలిపాడు. అయితే కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దొంగను పట్టుకున్నాడు. నిందితుడు కుమార్ కారును రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద వదిలేసివెళ్లాడు. కారులో కుమార్తో పాటు అతని బంధువు ఉన్నట్లు గుర్తించారు. అయితే బీహార్కు వెళ్లిన పోలీసు బృందం షియోహర్ జిల్లాలో వాళ్లను అరెస్టు చేశారు. భారీ మొత్తంలో బంగారంతో పాటు 5 లక్షల నగదును రికవర్ చేశారు.