న్యూఢిల్లీ: మ్యాట్పై పూర్తి ఆధిపత్యం కనబర్చిన సరిత మోర్.. జాతీయ మహిళల రెజ్లింగ్ చాంపియన్షిప్లో గీతా ఫొగట్ను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని గోండా వేదికగా జరుగుతున్న టోర్నీ 59 కేజీల విభాగంలో శుక్రవారం సరిత 8-0తో గీతపై ఏకపక్ష విజయం సాధించి స్వర్ణం నెగ్గింది.