ఆదిలాబాద్ టౌన్ : జాతిపితా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న గాంధీజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముడి బాటలో నడవాలని పలువురు పేర్కొన్నారు.
దీంటో భాగంగా ఆదిలాబాద్ ఆర్టీసీ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జయంతిని నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ నిరంజన్ గాంధీజీ వేషధారణ వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.