న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న పండుగ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. వైరస్ కట్టడికి అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని పేర్కొంది. కనీసం 14 రోజులపాటు ఆంక్షలు కొనసాగేలా చూడాలన్నది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
300కు చేరువగా ఒమిక్రాన్ కేసులు