తెలంగాణలో పరిశ్రమలు పెడితే ‘జైన్’కు సహకరిస్తాం
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): జల్గావ్ స్ఫూర్తితో తెలంగాణలో అరటి సాగును ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్లో 1.25 లక్షల ఎకరాల్లో అరటి సాగు చేయడం ఆదర్శనీయమన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి అరటి తోటలను, ఉల్లి విత్తన క్షేత్రాలను మంత్రి సందర్శించారు. తెలంగాణ రైతులను అరటిసాగు పరిశీలనకోసం జల్గావ్కు పంపిస్తామని మంత్రి తెలిపారు. మ హారాష్ట్రలో విభిన్న రకాల పంటల సాగు బాగుందని చెప్పారు. అనంతరం జైన్ సంస్థ ఎండీ అజిత్ జైన్తో మంత్రి భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో అంతర్జాతీయ అనుభవం ఉన్న జైన్ సంస్థ తెలంగాణలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పీనట్ బట్ట ర్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపిస్తే ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఇందుకు తెలంగాణలో అరటిసాగుకు సహకారం అం దించేందుకు జైన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాల్కసుమన్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజారాం ఉన్నారు.