మేడ్చల్ రూరల్, జనవరి 4 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎంఆర్ఐఈటీ)లో అభివృద్ధి, పరిశోధన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఐడియాథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు ఐడియా థాన్, హ్యాకథాన్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని, తమ ఆలోచన పరిధిని పెంచుకోవాలన్నారు. సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన సమస్యలకు సాంకేతికతతో ఉత్తమ పరిష్కారం చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.