కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు 15 లాబొరేటరీలకు శిక్షణనిచ్చినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. వైరస్ను గుర్తించేందుకు ఈ లాబొరేటరీల్లోని సిబ్బందికి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఆధ్వర్యంలో పకడ్బందీ శిక్షణనిచ్చినట్లు పేర్కొంది.
మంకీపాక్స్ కేసు నిర్ధారణ కాగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ బృందాన్ని కేరళకు తరలించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్కు చెందిన నిపుణులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారితో పాటు కేరళలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తుంది. ఆన్గ్రౌండ్ పరిస్థితులను సమీక్షిస్తుంది. అవసరమైన ప్రజారోగ్య సూచనలను సిఫారసు చేస్తుంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.