హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోది కాగా..దేశవ్యాప్తంగా సంస్థకు ఇది పదోది. ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాతో వర్క్ ఫ్రం హోమ్కు పరిమితమైన ఐటీ ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కార్యాలయ బాట పడుతున్నట్లు చెప్పారు. 85 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 1,400 మంది కూర్చోవడానికి వీలుంటుంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, చెన్నై, పుణె, బెంగళూరులల్లో ఆఫీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంస్థ..భవిష్యత్తులో నోయిడా, కోల్కతా, అహ్మదాబాద్, ముంబైకి విస్తరించే యోచనలో ఉన్నట్లు కంపెనీ కో-ఫౌండర్ శ్రీని తెలిపారు.