ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుపొందాడు. ఈ యంగ్ ఆల్రౌండర్ ఫైనల్లో పాకిస్థాన్పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. దాంతో, అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఈ వరల్డ్ కప్లో సామ్ కర్రన్ 13 వికెట్లు పడగొట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ కోసం ఐసీసీ రెండు రోజుల క్రితం తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాని విడుదల చేసింది. ఆ లిస్ట్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, సామ్కర్రన్, హేల్స్, టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ జట్టు నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది, జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా, శ్రీలంక స్పిన్నర్ హసరంగ పేర్లు ఉన్నాయి.
టీ 20 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఛేజింగ్లో బెన్స్టోక్స్ అర్థ సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.