న్యూజిలాండ్కు చెందిన న్యాయవాది, గ్రెగ్ బార్క్లే నూతన ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఐసీసీ బోర్డు గ్రెగ్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈయన ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికవ్వడం ఇది రెండోసారి. గ్రెగ్ రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఆక్లాండ్లో న్యాయవాదిగా పనిచేస్తున్న ఈయన మొదటిసారిగా 2020 నవంబర్లో ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ‘రెండోసారి ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికకావడం చాలా సంతోషంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ఐసీసీ డైరెక్టర్లకు కృతజ్ఞతలు’ అని గ్రెగ్ ఒక ప్రకటనలో చెప్పారు.
ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం గ్రెగ్ బార్క్లే, జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ అయిన తవెంగ్వా ముకుహ్లానీ పోటీ చేశారు. అయితే, తవెంగ్యా పోటీ నుంచి తప్పుకోవడంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా గ్రెగ్ని కొత్త ఛైర్మన్గా ఎన్నుకుంది. గ్రెగ్కు గతంలో న్యూజిలాండ్ క్రికెట్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు, ఈయన 2015లో జరిగిన ఐసీసీ మెన్స్ వరల్డ్కప్కి డైరెక్టర్గా వ్యవహరించాడు.