సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ భామ అదితీ రావు హైదరి. ఆ తర్వాత అంతరిక్షం, వీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మహాసముద్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సెలబ్రిటీల జీవితాల్లో విమర్శలు ఎలా భాగమవుతాయో చెప్పుకొచ్చింది. ప్రజలు పోల్చడం, విమర్శించడంలో ఎక్కువగా సంతోషపడతారు.
నేను చాలా సున్నితమైన వ్యక్తిని. ప్రతీ దానిని నేను ఆస్వాదిస్తాను. నేను ఏడుస్తున్నంత బిగ్గరగా నవ్వగలను. ఓ యాక్టర్ గా సెన్సిటివ్ యాంగిల్ ఉన్న వ్యక్తిని. నేను కష్టతరమైన రోజులు గడపగలను. ఇది కష్టమైన పనే. కానీ నేను ఎప్పుడు అంతర్గత కోణాన్ని చూడటానికి ప్రయత్నిస్తానంటూయ చెప్పింది అదితీరావు హైదరి. ఈ భామ డిజిటల్ ప్లాట్ ఫామ్లో విడుదలైన “ది గర్ల్ ఆన్ ది ట్రైన్” లో మెరిసింది.