జైపూర్: భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ రాజస్థాన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. హనుమాన్ఘర్ జిల్లాలో ఉన్న పొలాల్లో ఆ హెలికాప్టర్ను దించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. సంగరాయి పోలీస్ స్టేషన్కు చెందిన ఆఫీసర్ ఈ ఘటన గురించి ప్రకటన చేశారు. సాంకేతిక లోపం వల్లే హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఆయన చెప్పారు.