ముంబై: హిందీ భాష మాట్లాడేవాళ్లు పానీపురి అమ్ముకుంటారని తమిళనాడు విద్యాశాఖ మంత్రి వివాదాస్పద కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. హిందీ భాషను గౌరవిస్తానని, పార్లమెంట్లో ఆ భాషనే తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. యావత్ దేశం దీన్ని గమనిస్తోందని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఒకటే కోరుతున్నానని, ఏక్ దేశ్ ఏక్ విధాన్ ఏక్ భాషను అమలు చేయాలని ఎంపీ రౌత్ తెలిపారు. హిందీ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.