Hyundai India | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా యున్సూ కిమ్ నియమితులయ్యారు. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు దక్షిణకొరియాలోని హ్యుండాయ్ మోటార్స్ ప్రధాన కార్యాలయంలో యున్సూకిమ్ పని చేశారు. సంస్థ భారత్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన సియూన్ సియూబ్ కిమ్ (ఎస్ఎస్ కిమ్).. దక్షిణ కొరియా కేంద్రంగా గ్లోబల్ బాధ్యతలు నిర్వర్తిస్తారని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్0 ఓ ప్రకటనలో తెలిపింది.
హ్యుండాయ్ ఇండియా ఎండీగా ఎస్ఎస్ కిమ్ 2018 నవంబర్ నుంచి బాధ్యతలు నిర్వర్తించారు. మూడేండ్లు విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఎస్ఎస్ కిమ్.. హ్యుండాయ్ను నూతన తరం స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ (new age smart mobility solutions provider) గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కార్లకు ఇంటర్నెట్ కనెక్టవిటీ, కొనాలో ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్స్ ఆవిష్కరణతో భారత్లో సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ జర్నీకి శ్రీకారం చుట్టారు.
ఎస్ఎస్ కిమ్ హయాంలో హ్యుండాయ్ కార్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ప్రారంభించింది. ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్లో నూతనతరం మిడ్ సైజ్డ్ ఎస్యూవీ క్రెటా, కంపాక్ట్ ఎస్యూవీ వెన్యూతోపాటు గ్రాండ్ ఐ10 నియోస్, న్యూ ఐ 20 మోడల్ కార్లలో హ్యుండాయ్ను అగ్రస్థానంలో నిలిపారు.