IRCTC Hyderabad To LEH Tour | ఈ వేసవిలో లడఖ్-లేహ్ (Leh-Ladakh) చూడాలని ఎవరికి ఉండదు. అందులోనూ ఈ అందాలను చూడటానికి విమానంలో జర్నీ అంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. తాజాగా అలాంటి వారికోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
లేహ్ విత్ తుర్తుక్ ఎక్స్ హైదరాబాద్ (LEH WITH TURTUK EX HYDERABAD) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. జూన్ 28న ఈ ప్యాకేజీని (Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో లేహ్(LEH), లద్దాఖ్(Ladakh), షామ్ వ్యాలీ(Sham Valley), నుబ్రా (Nubra), తుర్తుక్ (TURTUK), పాంగాంగ్ (Pangong) లాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 6 రాత్రులు, 7 రోజులు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులకు ఫ్లైట్లో తీసుకెళ్లి లడఖ్ అందాలను ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) చూపించనుంది.
ఐఆర్సీటీసీ లేహ్ టూర్ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు లేహ్ ఎయిర్పోర్టులో దిగుతారు. రాత్రికి లేహ్లోనే బస ఉంటుంది.
Day 2 : రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి.. లేహ్ నుంచి షామ్ వ్యాలీకి బయలుదేరుతారు. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. అనంతరం హాల్ ఆఫ్ ఫేమ్, కాలీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్లను సందర్శిస్తారు. రాత్రి లేహ్లోనే బస ఉంటుంది.
Day 3: మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి.. నుబ్రా వ్యాలీ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత దిక్షిత్, హండర్ విలేజ్లను చూడొచ్చు. సొంత ఖర్చులతో క్యామెల్ సఫారీ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి.
Day 4: నాలుగో రోజు తుర్తుక్ గ్రామాన్ని (1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ సాధించిన గ్రామం ఇది) సందర్శిస్తారు. ఆనంతరం సియాచిన్ వార్ మెమొరియల్, థంగ్ జీరోపాయింట్ సందర్శించవచ్చు. తర్వాత బాల్టీ హెరిటేజ్ హౌజ్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్ చూడవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస ఉంటుంది.
Day 5: ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి పాంగాంగ్లోనే బస చేస్తారు.
Day 6: ఆరో రోజు పాంగాంగ్ లేక్లో సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత లేహ్ బయలుదేరాలి. దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ చూస్తారు. లేహ్కు చేరుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. రాత్రికి లేహ్లో బస ఉంటుంది.
Day 7: ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్ ఎయిర్పోర్టులో బయలుదేరితే రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ లేహ్ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.54,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.48,560, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.47,830 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి