హిమాయత్నగర్, జనవరి 26: పద్మశాలీలు హక్కులను సాధించుకోవాలని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర ఎన్.సుంకుర్వార్ పిలుపునిచ్చారు. నారాయణగూడలోని పద్శశాలి సంఘం ఇంజినీర్స్ విభాగం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుంకుర్వార్ మాట్లాడుతూ, పద్శశాలీలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. అనంతరం, ఇంజినీరింగ్ విభాగం ముద్రించిన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు పుట్ట పాండు రంగయ్య, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, నాయకులు వేణు మాధవ్, వనం దుశ్యంతల, మసున మోహన్ నారాయణ, జగన్నాథం, కత్తుల సుదర్శన్రావు, గుండేటి శ్రీధర్, ఆలే శంకర్, విఠల్, యర్రమాద వెంకన్న పాల్గొన్నారు.