సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): డయల్ 100కు కాల్ చేస్తే 5 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో మాట్లాడుతూ నగరంలో పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ కొనసాగుతుందని వెల్లడించారు. ట్రోలింగ్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలో ఉంటూ ప్రశాంత వాతావారణానికి భంగం కలుగకుండా బాధ్యతలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఘటనా స్థలంలో ఆధారాలు చెరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కిట్లు పెట్రోలింగ్ వాహనంలో అందుబాటులో ఉన్నాయన్నారు.
పెట్రోలింగ్ వ్యవస్థపై సీపీ వెల్లడించిన వివరాలు ఇలా..