శేరిలింగంపల్లి, డిసెంబర్ 01: రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. శాతాబ్ధి మండల్(32) అనే మహిళ గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్లో నివాసముంటూ.. ఓ సంస్థలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఫ్లాట్లో నివసిస్తున్న సహచరుణులు గీతామాధురి, ప్రియంకా రెడ్డిలు బయటకు వెళ్లగా, శతాబ్ధి మాత్రం తన గదిలోనే ఉంది. రాత్రి ప్రియంకా రెడ్డి, గీతా మాధురి ఇంటికి రాగా, గడియ పెట్టుకుని ఉంది. ఎంతకీ పిలిచినా స్పందన రాలేదు. బుధవారం అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించి.. తలుపులు విరగొట్టి చూడగా శతాబ్ధి మండల్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఉంది. మరోఘటనలో ఇందిరానగర్లో ఉండే దేబాండ్ రాయ్ , బిజిలీ రాయ్ దంపతుల కుమార్తె దీప్తిరాయ్(17) ఇంటర్ చదువుతున్నది. తల్లిదండ్రులు వంట పనులు చేసేందుకు బయటకు వెళ్లి.. మధ్యాహ్నం తిరిగి రాగా, దీప్తీరాయ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. ఈ రెండు ఘటనలపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.