బన్సీలాల్పేట్, నవంబర్ 24: పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. బుధవారం అమ్మవారి ఆలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్జయినీ మహంకాళి ఆలయ ప్రధాన అర్చకులు, వేదబ్రాహ్మణులతో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజల్లో మంత్రి తోపాటు ఆయన సతీమణి సువర్ణ, కుమారుడు సాయికిరణ్ యాదవ్ దంపతులు, సోదరుడు రవీందర్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, నాయకులు జీ.పవన్కుమార్ గౌడ్, కె.లక్ష్మీపతి, వెంకటేశన్ రాజు, బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు యాదవ్ పాల్గొన్నారు.