శేరి లింగంపల్లి, మార్చి 3: పేద విద్యార్థులకు చేయూ త అందించేందుకు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముం దుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్, శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మధురానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్ర తిభ కనభరిచిన విద్యార్థులకు మలబార్ చారిటబుల్ ట్ర స్టు ఆధ్వర్యంలో గురువారం స్కాలర్షిప్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాంధీ హాజరై చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం, ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, కార్పొరేటర్, స్వచ్ఛంద సంస్ధలు తగిన చేయూతను అం దించాలని ఆయన కోరారు. మలబార్ గ్రూప్ సంస్థ రిటైల్హెడ్ సిరాజ్ పీకే మాట్లాడుతూ ఒక్కొక్కరికి రూ.9,500 చొప్పున 100 మంది విద్యార్థులకు చెక్కులు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తం గా 286 మంది విద్యార్థులు స్కాలర్షిప్లకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి సాయిబాబా, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు సురేందర్, మలబార్ స్టోర్స్ సోమాజిగూడ, కొండాపూర్ ప్రతినిధులు శరీజ్, జిజాన్ తదితరులు పాల్గొన్నారు.