మల్కాజిగిరి జోన్, మార్చి 1: మహా శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం శైవక్షేత్రాలు , ఆలయాలు తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకి టలాడాయి. ‘శంభో శంకర హర హర మహాదేవ’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఆయా ఆలయాల్లో కొలువుదీరిన శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామి వారికి పూజ లు, అభిషేకాలు నిర్వహించారు.
అల్వాల్ సర్కిల్ కానాజీగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో డాక్టర్ సత్యనారాయణ శాస్త్రి , మచ్చ బొల్లారంలోని శివాలయంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పూజలు నిర్వహించారు. గౌతంనగర్ డివిజన్, దుర్గా భవానీ ఆలయం లో మల్కాజిగిరి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మేకల రాముయాదవ్, చుక్కల శతకోటి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ చుక్కుల వేణుకుమార్లు స్పటిక లింగేశ్వరునికి అభిషేకం చేశారు. నేరేడ్మెట్ డివిజన్లోని శివసాయినగర్ , జీకే కాలనీలోని శివాలయాల్లో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి , తదితరులు రుద్రాభిషేకం నిర్వహించారు.