మల్కాజిగిరి, ఫిబ్రవరి 20 : ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి.రాజు అన్నారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో అధికారులు పది ఇండ్ల ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా డీసీ జి.రాజు మాట్లాడుతూ.. గత కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించడం వల్ల ఇండ్ల యజమానులకు పన్నులు సకాలంలో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పెండింగ్లో ఉన్న ఆస్తిపన్నుల వివరాల జిరాక్స్ కాపీలను తీసుకుని వస్తే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు. మార్చి చివరి వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక అధికాలు కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు. ఆస్తిపన్నులు చెల్లించకుండా బకాయి పడిన వారికి రెడ్ నోటీసులు జారీ చేశామని, పన్నులు సకాలంలో చెల్లించాలని, చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం రెండు ఇండ్ల ఆస్తిపన్ను సమస్యను పరిష్కరించామని, అవకాశాన్ని ఇండ్ల యజమానులు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాల్యుయేషన్ ఆఫీసర్స్ సురేశ్కుమార్, నర్సింగరావు, టాక్స్ ఇన్స్పెక్టర్లు శ్రీకృష్ణ, అంకిత్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.