సికింద్రాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ సాధకుడు…. .ప్రగతి, సంక్షేమ, అభివృద్ధి రథ సారిధి…..సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన సంబురాలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రెండో రోజు బుధవారం సైతం రంగంలోకి దిగిన పార్టీ శ్రేణులు నియోజకవర్గాల్లోని ప్రతి బస్తీలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
బుధవారం కంటోన్మెంట్లోని పికెట్ నాలుగోవార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నళినికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. అదే విధంగా మారేడ్పల్లి మల్లీపర్పస్ ఫంక్షన్హాల్లో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా హోంమంత్రి మహమూద్ ఆలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్జి మర్రి రాజశేఖర్రెడ్డి ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు తిరుమలగిరి లాల్బజార్లో ఆర్యవైశ్య భవన్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, పాండుయాదవ్, నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, దేవులపల్లి శ్రీనివాస్, ప్రవీణ్యాదవ్, రాజ్సింగ్, లతామహేందర్, సరిత తదితరులు పాల్గొన్నారు.