సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘రత్నా ధోళి’ పుస్తకం చిన్న చిన్న కథలతో వాస్తవికతను ప్రతిబింబిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.వెంకటేశం అన్నారు. గుజరాత్ నుంచి ఆంగ్లంలోకి రచయిత్రి జెన్ని భట్ అనువాదించిన విధానం సమర్థవంతంగా ఉందన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం) అక్షర హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఫెస్టివల్-2021 కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బి.వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంజీవ్ చోప్రా, ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమినా మిర్జా, డాక్టర్ కన్నెగంటి రమేశ్బాబు పాల్గొన్నారు.