ముషీరాబాద్, నవంబర్ 11: ప్రణాళికలు లేకుండా, ప్రజా ధనం దుర్వినియోగమయ్యేలా చేపల మార్కెట్లో అభివృద్ధి పనులు ఎందుకు చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల వ్యాపారు లు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఫ్లోరింగ్ ఏర్పాటు చేయకుండా సమస్యను మరింత జఠిలం చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశించారు. గురువారం ముషీరాబాద్ చేపల మా ర్కెట్లో కొనసాగుతున్న ఫ్లోరింగ్, ఫుట్ పాత్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఈఈ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. తాను రోడ్డుకు సమాంతరంగా సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి చెత్త తరలింపు వాహనాలకు సులువుగా వెళ్లేలా పనులు చేపట్టమంటే ఎత్తు పెంచుతూ ప్రహరీ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపని పనులు ఎందుకు చేస్తున్నారని, విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. వెంటనే ప్రహరీ నిర్మాణం నిలిపివేసి రోడ్డుకు సమాంతరంగా వేదిక, ఫుట్పాత్ లేదా రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తే తాను అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.