దుండిగల్/కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, జనవరి 26 : భారత గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం కుత్బుల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రధాన కూడళ్లు , కాలనీలు, సంక్షేమ సంఘాల ప్రజలు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం చేశారు. గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో డీసీలు ప్రశాంతి, మంగతాయారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొంపల్లి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ జెండాను ఆవిష్కరించగా, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ జెండాను ఎగురవేశారు. వైస్ చైర్మన్ పద్మారావు, కమిషనర్ భోగీశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా, డిప్యూటీ మేయర్ ధన్రాజు, కమిషనర్ జె.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకుడు ముద్దాపురం మదన్గౌడ్ , చింతల నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి కార్మికులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.