బంజారాహిల్స్, జనవరి 25: వెంకటేశ్వరకాలనీ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంగళవారం నందినగర్, తదితర ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకునేందుకు ఆమె పర్యటించారు. బస్తీలోని పోచమ్మ ఆలయం సమీపంలో డ్రైనేజీ లైన్ పాడవడంతో మ్యాన్హోల్స్ పొంగిపొర్లుతున్నాయని స్థానికులు ఫిర్యాదుచేశారు. దీంతోపాటు మెట్లు పాడవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఆమెతో వాటర్వర్క్స్ మేనేజర్ రాంబాబు, నాయకుడు అశ్వాక్ ఉన్నారు.