అమీర్పేట్, జనవరి 25 : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. రూ.93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాసారం బస్తీ కమ్యూనిటీ హాలు వద్ద రూ. 36 లక్షల వ్యయంతో చేపట్టనున్న సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు, మోడల్కాలనీలో రూ.18.60 లక్షల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు, సౌభాగ్యనగర్ చౌరస్తాలో రూ.27 లక్షలతో చేపడుతున్న సివరేజీ లైను నిర్మాణ పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ. 12 లక్షలతో తీర్చిదిద్దిన సనత్నగర్ అశోక్కాలనీ, అల్లాద్దీన్ కోఠిలోని పవర్ బోర్లను మంత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా తాము నివసిస్తున్న స్థలాలపై ఎటువంటి హక్కులు లేకుం *డా అభద్రతా భావంలో ఉన్న బస్తీ వాసులకు పట్టాలు అందజేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చొరవ తీసుకుందని గుర్తు చేశారు. బస్తీలో మెరుగైన మంచినీటి, డ్రైనేజీ వ్యవస్థలను తీర్చిదిద్దుతామన్నారు.
అన్ని ప్రాంతాలకు బస్సులు..
సనత్నగర్ నుంచి నగరం నలు మూలలకు బస్సులు నడిచేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి సనత్నగర్ ప్రజలకు హామీ ఇచ్చారు. బస్సు సౌకర్యం కల్పించాలని కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి తలసాని కోరారు. మంత్రి తలసాని హామీతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, బోగి బాల్రాజ్, ఫాజిల్, సురేశ్గౌడ్, సంతోశ్ షరఫ్, ఆంజనేయులు యాదవ్, కోఠి బస్తీ అధ్యక్షుడు రఫీఖ్తో పాటు పెద్దసంఖ్యలో స్థానిక బస్తీ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
బేగంపేట్, జనవరి 25: వైద్య చికిత్స కోసం ఆర్థికంగ ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీకి చెందిన పి. శ్రీనివాస్ గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం మాజీ కార్పొరేటర్ సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. మంత్రి తలసాని చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. మంగళవారం రూ.2.50 లక్షల చెక్కును మారేడ్పల్లిలోని తన నివాసంలో శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.