మారేడ్పల్లి, జనవరి 23: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, నాయకులు ఆకుల నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.