చరిత్ర సృష్టించిన రచనలు
ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి
సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంటేనే చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, సాహిత్య అంశాలకు నిలువుటద్దమని చెప్పుకుంటాం. 1985లో సిటీ సెంట్రల్ గ్రంథాలయంలో కొన్ని పుస్తకాలు.. అతికొద్ది మంది పబ్లిషర్స్తో ‘బుక్ ఎగ్జిబిషన్’ ప్రారంభమైంది. ఇంతింతై వటుడింతై అనే విధంగా 34వ ‘జాతీయ పుస్తక పండుగ’ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో కొనసాగుతున్నతి. ఈ పుస్తక వనంలో 270 స్టాల్స్ వెలిశాయి. బాలల సాహిత్యం మొదలుకొని కళలు, చరిత్ర, సాంస్కృతిక, కాంపిటీషన్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సుమారు రెండు లక్షల 50వేల పుస్తకాలు, నవలలతో దర్శనమిస్తున్నది. కాలంతోపాటే వెలువడిన కథానికలు సాహిత్య ప్రియులను, అభిమానులను రంజింపజేస్తున్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన మంగళవారంతో ముగియనున్నది. తెలంగాణ అంటేనే ఓ చరిత్ర. దక్కన్ ప్రాంత ఒడిలో ఎందరో మహామహులు, కవులు, రచయితలు రాసిన పుస్తకాలు కాలంతోపాటే నడిచివస్తున్నాయి. ప్రజా కవులుగా, రచయితలుగా ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజల హృదయాల్లో
నిలిచిపోయారు.
అందులో కొన్ని ఇవి…
అక్షరాల ‘అగ్ని ధార’
‘నా గొడవ’
‘చిల్లర దేవుళ్లు’
‘మట్టి, మనిషి ఆకాశం’
‘విముక్త’
అమృతం కురిసిన రాత్రి
‘నో ఫ్యూచర్ విత్అవుట్ ఫర్గివ్నెస్’