Hyderabad | కొండాపూర్, ఏపిల్ 18 : క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకున్న బీటెక్, డిగీ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఓ సాఫ్ట్వేర్ సంస్థ మోసం చేపి బిచాణ ఎత్తివేసింది. పలువురు ఉద్యోగుల పేరుమీద లోన్లు తీసుకొని చివరకు బోర్డు తిప్పేసింది. ప్రాజెక్టులు లేవని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటు గచ్చిబౌలిలోని ఇన్సోఫీ సంస్థ ఉద్యోగులకు మెయిల్ పంపడంతో దాదాపు 700 మంది ఉద్యోగులు మంగళవారం గచ్చిబౌలిలోని సదరు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలిలోని ట్యూరింగ్ మైండ్స్ ఏఐ టెక్నాలజీ సంస్థ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పిస్తామంటూ తెలంగాణ, ఆంధపదేశ్లతో పాటు పలు రాష్ట్రాల్లో బీటెక్, డిగీ పూర్తిచేసిన విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపిక చేసింది.
విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులను క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట ఎంపికచేసి బీటెక్ పూర్తిచేసిన వారికి 6.2 లక్షల ప్యాకేజీ, డిగ్రీ పూర్తిచేసిన వారికి 5.2 లక్షల వార్షిక ప్యాకేజీని ఇస్తూ ఆఫర్ లేటర్లు పంపింది. మొదట గచ్చిబౌలిలోని కార్యాలయంలో 9 నెలల శిక్షణ ఉంటుందని చెప్పి దాదాపు 700 మంది ఉద్యోగులను ఎంపిక చేసుకుంది. ఎంపికైన అభ్యర్థులు గత కొన్ని నెలలుగా గచ్చిబౌలిలోని ఇన్సోఫీ సాఫ్ట్వేర్ సంస్థలో మూడు బ్యాచ్లుగా శిక్షణ తీసుకుంటూ హాస్టళ్లలో నివాసముంటున్నారు.
ఒక్కో బ్యాచ్కు 40 నుంచి 60మంది చొప్పున కంపెనీలో డేటా సైంటిస్టు, మెషిన్ లర్నింగ్ విభాగాల్లో వారానికి రెండు క్లాసులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మొదటి నెలలోనే 60 మంది ఉద్యోగుల పేరిట ఒక్కొక్కరిపై 4 నుంచి 10 లక్షల చొప్పున ఇన్సోఫీ సంస్థ ప్రైవేట్బ్యాంకుల్లో లోన్లు తీసుకుంది. మొదటి నెలలో స్టేఫండ్ కింద 10 వేలు అకౌంట్లలో జమచేయగానే అవి బ్యాంక్లోన్ల కింద కట్ చేసుకున్నారు.
తాజాగా ప్రాజెక్టులు లేవని, ఉద్యోగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ కంపెనీ పింక్ మెయిల్ పెట్టడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. తమ పేరుమీద తీసుకున్న లోన్లు క్లియర్ చేయాలని, ఎన్వోసీలు ఇవ్వాలని, ట్రైనింగ్ సర్టిఫికెట్లు, ఎక్స్ఫీరియన్స్ సర్టిఫికెట్లు అందజేయాలని కంపెనీ వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి స్పందించిన కంపెనీ సీఈఓ దక్షిణామూర్తి ఉద్యోగులతో చర్చించారు. ప్రాజెక్టులు లేని కారణంగానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని, లోన్లు క్లియర్ చేసి ఎన్వోసీ ఇస్తామని, శిక్షణ పూర్తిచేసుకున్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాయదుర్గం సీఐ మహేశ్ పేర్కొన్నారు.