కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో బరోడాతో ప్రారంభమైన రెండో మ్యాచ్లో హైదరాబాద్ 197 పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టులో జావేద్ అలీ (90 బంతుల్లో 65), తనయ్ త్యాగరాజన్ (51) మినహా మిగతా ఆటగాళ్లు మైదానంలో నిలబడకపోయారు. దీంతో 55.1 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటై తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఫదర్ షేట్ 5 వికెట్లతో హైదరాబాద్ను చావుదెబ్బ కొట్టగా.. లుక్మాన్ రెండు వికెట్లు, అభిమన్యు, భార్గవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రత్యూష్ కుమార్ (30) టాప్ స్కోరర్గా నిలువగా.. హైదరాబాద్ బౌలర్ రవితేజ రెండు వికెట్లతో విజృంభించాడు. తొలి మ్యాచ్లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.