చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి పరిధిలోని బృందావన్ కెమికల్ కంపెనీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. దాంతో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. సమీప ఇళ్లలోని వస్తువులు కిందిపడిపోయాయి. తలుపులు, కిటికీలు ఊగిపోయాయి.
దాంతో భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.