బాలి: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)కు షాకిచ్చాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో ప్రణయ్ 14-21, 21-19, 21-16 తేడాతో అక్సెల్సన్పై సంచలన విజయం సాధించాడు. తొలి గేమ్ను డెన్మార్క్ షట్లర్కు చేజార్చుకున్న ప్రణయ్..వరుస గేమ్ల్లో దూకుడు కనబరుస్తూ మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 17-21, 21-7, 21-12తో క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై నెగ్గింది. క్వార్టర్స్లో నెలిషాన్ ఇగిత్ (టర్కీ)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకాంత్ 13-21, 21-18, 21-15తో రెండో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేషియా)పై నెగ్గాడు. సింగిల్స్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 13-21, 19-21తో టాప్ సీడ్ కెంటా మొమోటా(జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి- ధ్రువ్ కపిల ద్వయం, మహిళల డబుల్స్ జంట అశ్వినీ-సిక్కిరెడ్డి నిరాశపర్చాయి.